నిజంనిప్పులాంటిది

May 12 2023, 15:00

అక్టోబర్ నవంబర్లోనే అసెంబ్లీ పోరు.. కర్ణాటక ఫలితాలపై బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ!

శనివారం వెలువడనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో అప్పుడే వేడి పెంచేశాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా పోరాడిన కర్ణాటకలో.. కాంగ్రెస్‌ స్వల్పంగా పైచేయి సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువడటం, అదేమీకాదు బీజేపీ మెజార్టీ సాధిస్తుందన్న అభిప్రాయాలూ వినిపించడంపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ముఖ్యంగా అధికార భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లో కర్ణాటక ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోంది. నిజానికి ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌ నెలల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో.. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు జరగడంతో.. అక్కడ రాబోయే ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయవచ్చని బీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది.

కాంగ్రెస్, బీజేపీలలో ఏది గెలిచినా.. తెలంగాణలో ఏ తరహా వ్యూహాన్ని అమలు చేస్తాయన్న దానిపై బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ లెక్కలు వేస్తున్నట్టు సమాచారం. కర్ణాటక ఎన్నికల ఫలితాలను అనువుగా ఎలా మలుచుకోవాలనే వ్యూహాలను సిద్ధం చేయడంపైనా దృష్టి సారించినట్టు తెలిసింది.

బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు..

కర్ణాటకలో బీజేపీ అమలు చేసిన పలు విధానాలు, వ్యవహరించిన తీరు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిందని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ బలమున్న బీజేపీ.. ప్రధానంగా హైదరాబాద్‌ నగరం, శివారు నియోజకవర్గాల్లో మాత్రమే కొంత బలంగా ఉందని అంచనా వేస్తోంది.

పట్టణ ప్రాంతాల్లో 8 నుంచి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల్లో మూడు, నాలుగు నియోజకవర్గాలు మినహా.. కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన పోటీదారుగా ఉంటుందని బీఆర్‌ఎస్‌ సంస్థాగత నివేదికల ఆధారంగా భావిస్తున్నట్టు తెలిసింది.

కర్ణాటకలో బీజేపీకి మెజార్టీ వచ్చి నా.. మేజిక్‌ ఫిగర్‌కు దగ్గరగా వచ్చి నా... అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సర్వశక్తులు ఒడ్డుతుందని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అక్కడ అధికారంలోకి వస్తే తెలంగాణలో దూకుడు పెంచుతుందని అభిప్రాయపడుతోంది. ఒకవేళ కర్ణాటకలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టకుంటే.. ఇక్కడ ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయడం సులువు అవుతుందని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు.

కాంగ్రెస్‌తోనే ప్రధాన పోటీ..

గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ కాంగ్రెస్‌కు బలమైన కేడర్‌ ఉన్నట్టు ఆత్మీయ సమ్మేళనాలకు ఇన్‌చార్జులుగా వ్యవహరించిన బీఆర్‌ఎస్‌ నేతలు పార్టీ అధినేత కేసీఆర్‌కు సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నట్టు తెలిసింది. హైదరాబాద్, శివారు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ సాధించే ఓట్లు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తాయని స్పష్టం చేసినట్టు సమాచారం.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కాంగ్రెస్‌కు ఉన్న ఓటు బ్యాంకు ఒక ఏడు శాతం తగ్గితే.. తాము గెలుపు కోసం శ్రమించాల్సి వస్తుందని ఓ ఎమ్మెల్యే వ్యా ఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. హుజూరాబాద్‌ తరహాలో గ్రేటర్‌ పరిధిలో కాంగ్రె స్‌ నామమాత్ర పోటీకి పరిమితమైతే ఇబ్బంది త ప్పవని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ వైపు మొగ్గుచూపే అవకాశము న్న వర్గాలపై ఫోకస్‌ పెట్టి.. బీఆర్‌ఎస్‌ వైపు తిప్పు కొనేలా వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం

నిజంనిప్పులాంటిది

May 12 2023, 14:58

కెసిఆర్ ముఖ్య సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరించిన సోమేశ్ కుమార్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముఖ్య సలహాదారుగా మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. ఈ ఉదయం ఆయన కొత్త బాధ్యతలను చేపట్టారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో వుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సోమేశ్ కుమార్ ను ఏపీకి కేటాయించారు. అయినప్పటికీ క్యాట్ ఉత్తర్వుల మేరకు ఆయన తెలంగాణలోనే కొనసాగారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ సుదీర్ఘ కాలం పని చేశారు. అయితే, ఆయనను తెలంగాణలో కొనసాగిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో తక్షణమే ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ సోమేశ్ కుమార్ ను హైకోర్టు ఆదేశించింది.

దీంతో సోమేశ్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ జీఏడీలో రిపోర్ట్ చేశారు. అయితే సీఎస్ గా పని చేసిన ఆయన.. అంతకంటే తక్కువ పోస్టులో పని చేయడానికి ఇష్టపడలేదు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత ఆయన స్వచ్చంద పదవీ విరమణ చేశారు. తాజాగా ఆయనకు కేసీఆర్ తన ముఖ్య సలహాదారుడిగా బాధ్యతలను అప్పగించారు.

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 12 2023, 14:56

ముఖ్యమంత్రి పదవి లక్ష్యం కాదు

ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేయడం లేదని పరోక్షంగా సూచించారు.40 సీట్లుంటే సీఎం పదవి అడిగేవాడినన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా జనసేన పొత్తు పెట్టుకుంటుందని తెలిపారు.

ఇటీవల కొద్దికాలంగా సినిమాలపై ఫోకస్ చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి పర్యటన చేపట్టారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశం ద్వారా పొత్తులపై తన వైఖరిని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీఎం పదవి డిమాండ్ లేదని పరోక్షంగా సూచించారు. బలం చూపించి పదవి తీసుకోవాలని, షరతులు పెట్టితే కుదరదని చెప్పారు. వైసీపీ నుంచి అధికారం లాక్కుని ప్రజలకు అప్పగించడమే పార్టీ లక్ష్యమన్నారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్ధి అయితేనే పొత్తు పెట్టుకోవాలని చెబుతున్న వ్యాఖ్యలపై సైతం స్పందించారు. రాష్ట్ర ప్రజలు 40 స్థానాలు ఇచ్చుంటే సీఎం పదవి డిమాండ్ చేసేవాడినని చెబుతూ పరోక్షంగా ఆ డిమాండ్ ఇప్పుడు చేయడం లేదనే సంకేతాలిచ్చేశారు.

2014లో కూడా అన్నీ అధ్యయనం చేసిన తరువాతే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. గతంలో కూడా బీజేపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలు పొత్తులతోనే బలపడ్డాయనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. గౌరవానికి భంగం కలగకుండా పొత్తులుంటాయన్నారు. గతంతో పోలిస్తే జనసేన బలం గణనీయంగా పెరిగిందని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీకు సగటున 7 శాతం ఓట్లు రాగా, ఈసారి ఆ బలం 18-19 శాతానికి పెరిగిందన్నారు. 2019 నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే పొత్తుల గురించి మాట్లాడానన్నారు. 2019 ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేశామని..అప్పట్లో కనీసం 30-40 స్థానాలు గెల్చుకునుంటే కర్ణాటక తరహా పరిస్థితి ఉండేదన్నారు.

పొత్తులకు కొన్ని పార్టీలు ఒప్పుకోకుంటే ఒప్పిస్తామన్నారు. కచ్చితంగా రానున్న ఎన్నికల్లో పొత్తులుంటాయని తెలిపారు. సీఎం పదవి డిమాండ్ చేయాలంటే 30-40 సీట్లు ఉండాలన్నారు. కర్ణాటకలో కుమారస్వామి 30 సీట్లతోనే ముఖ్యమంత్రి అయిన సంగతిని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు

నిజంనిప్పులాంటిది

May 12 2023, 14:53

కొండగట్టులో అంజన్న ఉత్సవాలు : భద్రాది నుంచి పట్టు వస్త్రాలు

మల్యాల మండలం కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలకు రంగం సిద్ధమైంది. కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకల ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ వెంకటేశం తెలిపారు.

మొదటి రోజు ఉదయం స్వస్తిక్వచనం, రక్షాబంధనం, రుత్విక్ వరణం, అరుణి మథనం, దేవతాహవనం, ఉత్సవ మూర్తి యాగశాల ప్రవేశం, దేవతాపూజలు, అగ్నిప్రతిష్ట, హవనం, స్వామివారికి అభిషేకాలు, సహస్ర నామార్చన ఏర్పాటు చేశారు. సాయంత్రం విష్ణసహస్రనామ పారాయణం, స్థాపిత దైవం, బలిహరణం, సుందరకాండ పారాయణం, అమ్మవారి సహస్రమమకుంకుమార్చన, బలిహరణం, మంత్రపుష్ప జరుగుతాయని పేర్కొన్నారు.

కొండగట్టులో నేడు హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 వరకు వేడుకలు జరగనుండగా.. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14న హనుమంతుని జయంతి కావడంతో లక్షలాది మంది అంజనా దీక్షాపరులు రానున్నారు. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భద్రాచలం సీతారాచంద్రస్వామి ఆలయం నుంచి స్వామివారికి పట్టువస్త్రాలు పంపారు. వాటిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ స్వామికి అందజేయనున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ముందస్తుగా 3.60 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు.

ఇవి సరిపోకపోతే వెంటనే సిద్ధం చేసేందుకు అదనపు సిబ్బందిని నియమించినట్లు ప్రసాద తయారీ ఇన్ చార్జి ధర్మేందర్ తెలిపారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా వెంటనే పులిహోర సిద్ధం చేస్తామని తెలిపారు. 14 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం వైశాఖ ముల్దశమి రోజున హనుమంతుని తిరునక్షత్ర జయంతి వేడుకలను ఆలయ సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారు.

మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలో త్రికుండమంతిమ యజ్ఞం నిర్వహించి వార్షికోత్సవం రోజున పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా కొండగట్టు ఆలయంలో నిఘా పెంచేందుకు 104 సీసీ కెమెరాలతో పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఆలయం తరపున ఆలయం లోపల, బయట ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలకు అదనంగా 40 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

నిజంనిప్పులాంటిది

May 12 2023, 14:51

హైదరాబాదులో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

ఐటీ కారిడార్‌ లో మూడు నెలల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. శిల్పా లేఅవుట్‌ ఫేజ్‌ -2 ఫ్లైఓవర్‌ పనుల కోసం గచ్చిబౌలి జంక్షన్‌ నుంచి కొండాపూర్‌ వరకు పలుచోట్ల ఈ మళ్లింపులు విధిస్తున్నట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఈ నెల 13 నుంచి ఆగస్టు 10 వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.

అందుకోసం అధికారులు రూట్‌ మ్యాప్‌ ను విడుదల చేశారు

ఔటర్‌ రింగ్‌రోడ్‌ నుంచి హఫీజ్‌పేట్‌కు వెళ్లాల్సిన వాహనదారులు శిల్పా లే అవుట్‌ ఫ్లైఓవర్‌-మీనాక్షి టవర్స్‌-డెలాయిట్‌-ఏఐజీ ఆస్పత్రి- క్యూమార్ట్‌- కొత్తగూడ ఫ్లైఓవర్‌ ద్వారా హఫీజ్‌పేట్‌ చేరుకోవాలి.

లింగంపల్లి నుంచి కొండాపూర్‌ వెళ్లాల్సిన వాహనదారులు గచ్చిబౌలి ట్రాఫిక్‌ పీఎస్‌- డీఎల్‌ఎఫ్‌ రోడ్‌- రాడిసన్‌ హోటల్‌- కొత్తగూడ మీదుగా కొండాపూర్‌ చేరుకోవాలి.

విప్రో జంక్షన్‌ నుంచి ఆల్విన్‌ క్రాస్‌రోడ్స్‌ వెళ్లే వాహనాలను ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌- లెఫ్ట్‌ టర్న్‌- గచ్చిబౌలి స్టేడియం వద్ద యూటర్న్‌- డీఎల్‌ఎఫ్‌ రోడ్‌- రాడిసన్‌ హోటల్‌- కొత్తగూడ ఫ్లైఓవర్‌, ఆల్విన్‌ వైపు అనుమతిస్తారు.

టోలీచౌకీ నుంచి ఆల్విన్‌ క్రాస్‌రోడ్స్‌ వెళ్లే వాహనదారులు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌- మైండ్‌స్పేస్‌ జంక్షన్‌- సైబర్‌ టవర్స్‌ జంక్షన్‌- లెఫ్ట్‌ టర్న్‌ హైటెక్స్‌ సిగ్నల్‌- కొత్తగూడ జంక్షన్‌ ద్వారా ఆల్విన్‌ వైపు వెళ్లాలి.

టెలికామ్‌ నగర్‌ నుంచి కొండాపూర్‌ వెళ్లాల్సిన వాహనదారులు గచ్చిబౌలి అండర్‌ ఫ్లైఓవర్‌ వద్ద యూటర్న్‌ తీసుకుని- శిల్పా లే అవుట్‌ ఫ్లైఓవర్‌ బస్టాప్‌ పక్క నుంచి- మీనాక్షి టవర్స్‌- డెలాయిట్‌- ఏఐజీ ఆస్పత్రి- క్యూ మార్ట్‌- కొత్తగూడ ద్వారా కొండాపూర్‌ చేరాలి.

బస్సులూ ప్రత్యామ్నాయ మార్గాల్లోనే..

ట్రాఫిక్‌ మళ్లింపుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో బస్సుల రాకపోకలు కొనసాగుతాయని టీఎస్‌ఆర్టీసీ సికింద్రాబాద్‌ రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లింగంపల్లి నుంచి మెహిదీపట్నం వెళ్లే 216కే బస్సు రాడిసన్‌ హోటల్‌ Xరోడ్‌ నుంచి మీనాక్షి టవర్‌, ఐకియా, బయో డైవర్సిటీ Xరోడ్‌ మీదుగా వెళ్తుందన్నారు.

మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ నుంచి మంచిరేవులకు వెళ్లే 221బస్సు రాడిసన్‌ హోటల్‌ నుంచి డీఎల్‌ఎఫ్‌, ఐఐఐటీ Xరోడ్‌ నుంచి గచ్చిబౌలి మీదుగా, సికింద్రాబాద్‌ నుంచి వేవ్‌రాక్‌కు వెళ్లే 10హెచ్‌డబ్ల్యూ బస్సు డీఎల్‌ఎఫ్‌, ఐఐటీ Xరోడ్‌, విప్రో సర్కిల్‌ మీదుగా రాకపోకలు సాగించనుంది.

నిజంనిప్పులాంటిది

May 12 2023, 12:03

నర్సులను గౌరవిద్దాం!!

ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ ఆధ్వర్యంలో ఉత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడంలో నర్సులు పాత్ర, ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ఏటా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.1953లో డోరోథీ సదర్లాండ్, యుఎస్ డిపార్ట్​మెంట్ ఆఫ్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ లో ఒక అధికారి, అధ్యక్షుడు డ్వైట్ డి. ఐసెన్హోవర్ ‘నర్సుల దినోత్సవం’ను ప్రకటించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ నర్సుల డే నిర్వహిస్తున్నారు.

1820 మే12న ఆధునిక నర్సింగ్ స్థాపకురాలు, ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు. యుద్ధ సమయంలో ఆమె శిక్షణ పొందిన నర్సుల మేనేజర్ గా పనిచేస్తూ గాయపడిన సైనికులకు సాయం చేసేది. అలా ఆరోగ్య సంరక్షణ సేవలు, నర్సింగ్ వృత్తిని సంస్కరించింది.1860 లో లండన్ లోని సెయింట్ థామస్ హాస్పిటల్లో ‘నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్’ను ప్రారంభించింది. నర్సులు, పర్యావరణం, పేదరికం తదితర అంశాలపై ఆధారపడి ఏటా ఒక థీమ్ ను ఎంపిక చేసి నర్సుల డే నిర్వహిస్తారు. ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, కెనడా తదితర దేశాల్లో వారం రోజుల పాటు వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది 2023లో “మన నర్సులు- మన భవిష్యత్తు” అనే థీమ్ తో నర్సుల డే నిర్వహించుకుంటున్నాం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం

నర్సుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. వచ్చే రెండేళ్లలో దేశంలో 157 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయనుంది. కేంద్ర ఆరోగ్య మంత్రి డా. మన్​సుఖ్ మాండవీయ స్వయంగా ఆ విషయం ప్రకటించడం హర్షణీయం. భారతదేశంలో ప్రస్తుతం 5,324 నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. రాబోయే 24 నెలల్లో 157 కొత్త నర్సింగ్ కాలేజీలు ఈ జాబితాలో చేరతాయి. ఈ ఇన్‌స్టిట్యూట్‌ల ఏర్పాటుకు మొత్తం రూ.1,570 కోట్ల బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. భారత ప్రభుత్వం ప్రతి వైద్య కళాశాలలో, కొత్త నర్సింగ్ కళాశాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ నర్సింగ్ కళాశాలల స్థాపన ద్వారా దాదాపు 16,000 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి.

దీంతో దేశంలో వైద్య విద్య విస్తరణ జరుగుతుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు కేంద్రం157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు కూడా ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొమ్మిది కొత్త వైద్య కళాశాలల కోసం అదనంగా1,827 స్టాఫ్ నర్సులను కూడా నియమించనుంది. వచ్చే సంవత్సరం నుంచి విద్యార్థుల అడ్మిషన్స్​ మొదలవుతాయి. ఒక్కో మెడికల్ కాలేజీకి 203 స్టాఫ్ నర్సులను కేటాయించనున్నారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2022లో 5,204 స్టాఫ్ నర్సుల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సమాజ సేవే లక్ష్యంగా పని చేస్తున్న నర్సుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు మంజూరు చేసి వారిని ప్రోత్సహించాలి. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో నర్సులకు మంచి సౌకర్యాలు కల్పించాలి. ప్రొఫెషనల్ కోర్సులను కాదని సేవ దృక్పథంతో బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న నర్సింగ్ విద్యార్ధులను ప్రోత్సహించి వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా కృషి చేయాలి. హాస్పిటల్ లో చికిత్స పొందే రోగులను మన కుటుంబంలో ఒక మనిషిగా ఆరోగ్య సేవలు అందించే నర్సులను మనం ఎల్లప్పుడూ గౌరవిద్దాం.

నిజంనిప్పులాంటిది

May 12 2023, 10:35

రేపే ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి

బెంగళూరు:

కర్ణాటక ఎన్నికల్లో గెలుపోటములపై అన్ని పార్టీలూ మల్లగుల్లాలు పడుతున్నారు. విజయం మాదంటే మాదేనంటూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో శనివారం మధ్యాహ్నానికి తేలిపోతుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని, ఓటింగ్‌ సరళి కూడా కాంగ్రెస్‌ వైపు ఉన్నట్లు ఆ పార్టీ చెబుతోంది. మరోవైపు, మిశ్రమ ఫలితాలు వస్తే ఏమి చేయాలనే దానిపై అన్ని పార్టీలు చర్చిస్తున్నాయి. మరోసారి జేడీఎస్ కింగ్ మేకర్‌గా అవతరిస్తుందా? అనేది రేపటికల్లా తెలిపోనుంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

హంగ్ వస్తుందని అంచనా వేసిన పలు సర్వేలు

సింగ్‌పూర్‌లో బీజేపీ నేతలతో కుమారస్వామి భేటీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏపార్టీకీ పూర్తి మెజార్టీ రాదని, హాంగ్ ఏర్పడే సూచనలు ఉన్నాయని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో జేడీ (ఎస్)కు కాంగ్రెస్, బీజేపీల నుంచి ఆఫర్లు వస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే కుమారస్వామి తన కుటుంబంతో కలిసి బుధవారం రాత్రి సింగ్‌పూర్‌ వెళ్లారు. ఏ పార్టీతో కలిసి వెళ్లానే నిర్ణయం ఇప్పటికే తీసుకున్నామని జేడీఎస్‌కు చెందిన ఓ సీనియర్ నేత వెల్లడించారు. బీజేపీకి చెందిన కొందరు నేతలు జేడీఎస్‌తో ఇప్పటికే ముందస్తు చర్చలు చేపట్టారని సమాచారం.

దీనికి అనుగుణంగా కుమారస్వామి సింగపూర్‌కు వెళ్లడంతో అక్కడ ప్రధాని మోదీకి సంబంధించిన ప్రతినిధులతోనూ సమావేశమవుతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జేడీఎస్ సీనియర్ నేత తన్వీర్ అహ్మద్ మాట్లాడుతూ..

ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం.. సరైన సమయంలో దానిని ప్రకటిస్తాం’ అని అన్నారు. అయితే, జేడీఎస్‌ను సంప్రదించినట్టు జరుగుతోన్న ప్రచారాన్ని బీజేపీ కొట్టిపారేసింది. స్పష్టమైన మెజార్టీతో తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసింది.

బీజేపీ నేత శోభా కరంద్లాజే మాట్లాడుతూ.. ‘సంకీర్ణం ప్రశ్నే లేదు.. జేడీఎస్‌ను మేము సంప్రదించలేదు.. పోలింగ్ ముగిసిన తర్వాత కార్యకర్తల నుంచి క్షేత్రస్థాయిలో అందిన నివేదికలు, సమాచారం ప్రకారం మాకు 120 సీట్లు పక్కాగా వస్తాయి’ అని వ్యాఖ్యానించారు. దీనిపై జేడీఎస్ నేత తన్వీర్‌ను ప్రశ్నించగా.. ప్రభుత్వ ఏర్పాటుపై మాతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపారని పునరుద్ఘాటించారు.

ఇరు పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) మమ్మల్ని సంప్రదించాయి.. ప్రస్తుతం పార్టీలు మా దగ్గరకు వెళ్లాలనుకునే పరిస్థితిలో జేడీఎస్ ఉంది.. రాష్ట్ర అభివృద్ధి కోసం రెండు జాతీయ పార్టీలకు చెక్ పెట్టాలని కర్ణాటక ప్రజలు కోరుకుంటున్నారు.. ఒక ప్రాంతీయ పార్టీ కర్ణాటక అభివృద్ధికి పని చేయకపోవడానికి కారణం లేదని నేను అనుకోను’ అని చెప్పారు.

ఏ పార్టీతో వెళ్తారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. కర్ణాటక, కన్నడిగుల అభ్యున్నతి కోసం కృషి చేసే పార్టీతో కలిసి నడుస్తామని వివరించారు. మీ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో స్పష్టతకు వచ్చారా అని అడిగితే.. ‘మేము లేకుండా ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు.. ఇది మంచి సంఖ్య అని నేను అనుకుంటున్నాన. డబ్బు, బలం, బలగం పరంగా జాతీయ పార్టీల వనరులతో సరిపోలలేం.. మేము బలహీనులం. కానీ మేము ప్రభుత్వంలో భాగం అయ్యేంత పని చేశామని మాకు తెలుసు’ అని పేర్కొన్నారు

నిజంనిప్పులాంటిది

May 12 2023, 10:22

కావలిలో సీఎం జగన్ పర్యటన..

నెల్లూరు జిల్లా:

చుక్కల భూముల అనుభవదారులకు పట్టాలు పంపిణీ ..పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి..

జిల్లాలో 18 వేల మంది రైతులకు 43 వేల 270 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కు..

మినీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న జగన్..

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 12 2023, 09:38

ముస్లింలుగా మారింది ఎందరు? ఉగ్ర కేసులో రంగంలోకి NIA

ఉగ్ర కుట్ర కేసులో ఎన్ఐఏ త్వరలో రంగంలోకి దిగనున్నట్టు తెలి సింది. హిజ్బుత్ తెహ్రీర్ నెట్వర్క్ వేర్వేరు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నందున కేసు విచారణను చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే పట్టుబడ్డ వారిని జరిపిన విచారణలో దేశంలో ని ప్రధాన పట్టణాల్లో విధ్వంసానికి కుట్రలు చేసి నట్టు వెల్లడైన విషయం తెలిసిందే. కేసు తీవ్రత, విస్తృతి నేపథ్యంలోనే ఎన్ఐఏ ఇందులో విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.

‘హిజ్బుత్ తహ్రీర్’ కేసుపై స్టేట్ ఇంటలిజెన్స్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ కేసులో 17 మందిని మధ్యప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఆరుగురు హైదరాబాద్ లో దొరికారు. కాగా, హిజ్బుత్ తహ్రీర్ సంస్థ మత మార్పిడులూ చేస్తూ, దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.

అయితే హైదరాబాద్‌లో కూడా మత మార్పిడులు జరిగాయా? అలా జరిగితే ఎంత మందితో మతం మార్పించారు? అనే వివరాలను కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. మధ్యప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు సీజ్ చేసిన ఫోన్ల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లో దొరికిన నిందితుడు మహమ్మద్ సలీం మత మార్పిడుల్లో కీలక పాత్ర పోషించినట్టు భావిస్తున్నారు.

భోపాల్‌కు చెందిన సౌరబ్ వైద్యను జిమ్ ట్రైనర్, హిజ్బుత్ తహ్రీర్ సంస్థ సభ్యుడైన యాసీన్ మతం మార్పించినట్లు విచారణలో తేలినట్లు సమాచా రం. సలీంగా పేరు మార్చిన తర్వాత అతడిని హైదరాబాద్ పంపినట్టు తెలిసింది. ఓ బడా వ్యాపారి సిఫార్సుతో సలీం ప్రముఖ మెడికల్ కాలేజీలో హెచ్వోడీగా చేరాడు.

ఆ తర్వాత వే టు రైట్ పాత్ పేరుతో యు ట్యూబ్ ఛానల్ ను కూడా ప్రారంభించినట్టు మధ్యప్రదేశ్ పోలీసుల విచారణలో తేలింది. మతం మార్చుకున్న వారి కోసమే ఈ ఛానల్ ను సలీం నడుపుతున్నట్టు వెల్లడైంది. ఈ క్రమంలోనే సలీం ఎంత మందితో మతం మార్పించాడు అన్నది తెలుసుకోవటానికి తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ సిబ్బంది రంగంలోకి దిగినట్టు సమాచారం.

నిజంనిప్పులాంటిది

May 12 2023, 09:37

మగవాళ్లే టార్గెట్

నగరంలో చైన్ స్నాచర్లు పెట్రేగిపోతున్నారు. సరికొత్త మార్గాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. రద్దీగా ఉన్న బస్సులను టార్గెట్ చేస్తూ.. మగవారి మెడలోని బంగారు గొలుసులను తస్కరిస్తున్నారు. ఇలా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ పోలీసులు పట్టుకున్నారు.

హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. నగరంలో తిష్ట వేసిన అంతరాష్ట్ర ముఠాలు పగలు రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇక చైన్ స్నాచర్లు కూడా రెచ్చిపోతున్నారు. ఉదయం వేళలో ఇంటి ముందు మగ్గులు వేసే ఆడవారు, వాకింగ్‌కి వెళ్లేవాళ్లను లక్ష్యంగా చేసుకొని స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు.

తాజాగా.. స్నాచర్లు సరికొత్త పద్దతుల్లో దొంగతనాలకు తెరతీశారు. రద్దీగా ఉన్న బస్సులను టార్గెట్ చేశారు. అందులోనూ మగవారే వారి లక్ష్యం. ముఠాగా ఏర్పడిన పలువురు స్నాచర్లు రద్దీ బస్సులను టార్గె్ట్ చేసి స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. మగవారి మెడలోని బంగారు గొలుసు, బ్రాస్లెట్‌లు స్నాచింగ్ చేస్తు్న్నారు. ఇటీవల కాలంలో నగర వ్యాప్తంగా బాధితులు పోలీసులను ఆశ్రయించటంతో స్నాచింగ్ ముఠా గుట్టు వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కొందరు పాత నేరస్థులు కాంబ్లే లక్ష్మణ్ నేతృత్వంలో ఒక ముఠాగా ఏర్పాడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ చైన్ స్నాచర్లు కేవలం రష్‌గా ఉన్న బస్సులను మాత్రమే టార్గెట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. అందులోనూ ఆడవారి జోలికి వెళ్లకుండా బస్సుల్లో ప్రయాణించే మగవారి మెడలో ఉన్న బంగారు గొలుసులు, చేతులకు ఉండే బ్రాస్లెట్‌లను దోచుకుంటున్నారు. రష్‌గా ఉన్న బస్సులో ముందుగా ప్రయాణికుల మాదిరిగా ఎక్కుతారు. కొందరు బస్సు మధ్యలో మరికొందరు ఫుట్‌బోర్డుల్లో ప్రయాణిస్తారు.

బస్సు మధ్యలో ఉన్న వారు అటూ ఇటూ తిరుగుతూ.. ఎవరి మెడలో బంగారం ఉందనే దానిపై రెక్కీ నిర్వహిస్తారు. అనంతరం మెల్లిగా వారి మెడలోంచి బంగారు ఆభరణాలు స్నాచింగ్ చేస్తారు. అనంతరం వాటిని ఫుట్‌బోర్డులో ఉండేవారికి అందిస్తారు. వారు మధ్యలోనే దిగి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. ఒకవేళ గోల్డ్ చైన్ పోయిందని ఎవరైనా గుర్తించినా.. వారికి అనుమానం రాకుండా జాగ్రత్తలు పడతారు. గత కొంత కాలంగా నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, హుమాయున్ నగర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చాయి.